హైదరాబాద్, వెలుతురు (జులై 19):
దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం’ ఈ ఏడాదికిగాను ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, పాలపిట్ట సాహిత్య పత్రిక సంపాదకులు గుడిపాటికి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
ఈ నెల 22న రవీంద్రభారతిలో జరిగే కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా గుడిపాటికి పురస్కారంతో పాటు రూ. 1,01,116 నగదు బహుమతితో సత్కరిస్తారు. దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారానికి ఎంపికైన గుడిపాటికి పలువురు కవులు,రచయితలు శుభాకాంక్షలు తెలిపారు.
