రాజ్యసభ సభ్యునిగా మల్లికార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారం

రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే జూన్ 29న ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఖర్గే చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, సభ నాయకుడు జె.పి. నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసి వేణుగోపాల్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.